AP TET | బిగ్‌ అలర్ట్‌.. టెట్‌ దరఖాస్తుల గడువు పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

ఏపీలో టీచర్‌ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌! ఇంకా టెట్‌ దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.. ఎందుకంటే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఆగస్టు 3వ తేదీతో గడువు ముగియనుంది.

టెట్‌ దరఖాస్తుల గడువును పెంచుతారని ఒక ప్రచారం జరగుతుంది. ఈ నేపథ్యంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు స్పందించారు. టెట్‌ దరఖాస్తు గడువును పొడిగించడం లేదని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు గడువు ముగిసేలోపు టెట్‌ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు విజయరామరాజు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఏపీలో టెట్‌ నిర్వహణకు సంబంధించి జూలై 2వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మూడో తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. సీబీటీ విధానంలో ఈ ఏడాది అక్టోబర్‌ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు విడతల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

ఏపీ టెట్‌ – 2024 పరీక్షకు సంబంధించి మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కులు, బుద్ధులు, జైనులు వంటి తదితర మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఉర్దూ, తెలుగు మీడియంలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 19 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top